సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ కోటి నీలిమ ఆదేశాల మేరకు, సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులుగా నియమితులైన కాంగ్రెస్ నాయకులకు, బి బ్లాక్ (సనత్ నగర్, అమీర్ పేట్ డివిజన్ల) కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో సన్మానం కార్యక్రమం శుక్రవారం రోజు అమీర్పేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అమీర్ పేట్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు రాజా రాజేశ్వరి మాట్లాడుతూ… అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమంత్ రావు వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలు శ్రీకాంత్ గౌడ్, ఎస్ ఎస్ రావు, రాజ్ యాదవ్, సెక్రటరీలు రోహిత్ ఆనంద్, కామర్, రజినికాంత్, సాయి గౌడ్, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ పద్మ రాణి, వినోద్ సింగ్, స్పోక్స్ పర్సన్ ప్రతాప్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

