- జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
- అట్టహాసంగా సాగిన ప్రజాప్రతినిధుల అవగాహన సదస్సు.
“ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని అమలుచేసి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రగతిని సాధిద్దామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం, నిర్మల్ పట్టణంలోని తిరుమల గార్డెన్స్ లో, ఇటీవలి ఎన్నికైన గ్రామ సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు.





ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, నిర్మల్, ముధోల్, ఖానాపూర్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పవార్ రామారావు పటేల్, వెడ్మ బొజ్జు పటేల్ లతో కలిసి పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి, తెలంగాణ రాష్ట్ర గీతం ఆలాపన చేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలువురు చిన్నారులచే ప్రదర్శింపబడిన సంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వీరికి కలెక్టర్, ఎమ్మెల్యే లు జ్ఞాపికలు అందజేశారు.





ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు పరుస్తున్న పథకాలు, కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో 99 రోజుల ప్రత్యేక ప్రణాళికను ప్రారంభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.
ప్రత్యేక ప్రణాళికలో భాగంగా జిల్లాలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజల్లో ఉన్న అనారోగ్య సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజా ప్రతినిధులందరికీ పంచాయతీరాజ్ మున్సిపల్ చట్టాలపై అవగాహన ఉండాలని తెలిపారు. ప్రజా ప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు.




ప్రజా ప్రతినిధులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలి:
నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
ప్రజా ప్రతినిధులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్మల్ శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రజా ప్రతినిధులుగా ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం గొప్ప విషయం అని, నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు అంతా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, పరిష్కరించే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి కృషి చేయాలని. అధికారులు పెండింగ్లో ఉన్న పైల్స్ అన్నింటిని 99 రోజుల ప్రణాళికలో భాగంగా పుష్కరించాలని తెలిపారు.

అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి:
ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్.
ప్రజా సంక్షేమానికై, అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ అన్నారు. ఇటీవలి స్థానిక సంస్థల్లో ఎన్నికైన వారిలో ఎక్కువ శాతం యువత ఉన్నారని. వీరంతా ఉత్సాహంగా ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ పథకాల అమలులో కృషి చేయాలని ఆయన తెలిపారు.

గ్రామాల అభివృద్ధిలో సర్పంచులదే ముఖ్యపాత్ర:
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్.
ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధిలో సర్పంచులదే కీలకపాత్ర అని తెలిపారు. ప్రజా ప్రతినిధులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానకర్తనులుగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు గ్రామసభలు నిర్వహిస్తూ, గ్రామంలోని సమస్యలను తెరుసుకొని పరిష్కరించాలని తెలిపారు. ప్రజా ప్రతినిధులకు ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా, వారికి పరిపాలన జ్ఞానం పెరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాకు నిధులు తీసుకురావడంలో తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
అనంతరం పెంబి ఆస్పిరేషన్ బ్లాక్ ను అభివృద్ధి పథంలో నడిపిన ప్రజాప్రతినిధులను, సన్మానించి అభినందించారు. అధికారులు ప్రజల విలువైన భాగస్వామ్యంతోనే పెంబి ఆస్పిరేషన్ నుంచి నుంచి ఇన్స్పిరేషన్ వైపు పయనించిందని కొనియాడారు. రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలలో అద్భుత ప్రగతి కనబరిచి పథకాలు సాధించిన క్రీడాకారులకు జ్ఞాపికలు అందించి, సన్మానించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి అధికారులు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం శాఖల వారీగా సర్పంచులు ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, నిర్మల్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లు అప్పాల కావ్య, అప్పాల గణేష్ చక్రవర్తి, భైంసా మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ దత్తాత్రి, జిల్లా గ్రంథాల సంస్థ చైర్మెన్ సయ్యద్ అర్జుమంద్ అలీ, డిఎల్ఎస్ఎ సెక్రటరీ రాధిక, సర్పంచ్ లు, మున్సిపల్ కౌన్సిలర్ లు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
