మేడారం సమ్మక్క సారలమ్మ జాతర(Sammakka Saaralamma Jatara)–2026 కోసం భారీఎత్తున ఏర్పాట్లు చేశారు. రవాణా & బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) శనివారం మేడారంలో తాత్కాలిక ఆర్టీసీ బస్ స్టేషన్(Temporary Rtc Bus Station)ను ప్రారంభించారు. చారిత్రాత్మక గిరిజన పండుగ(Tribal Festival) కోసం రవాణా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో ఇది ఒక ప్రధాన అడుగు అని పేర్కొన్నారు. సీఎం రేవంత్, మంత్రి సీతక్క ఆధ్వర్యంలో మేడారం కోసం శాశ్వత రవాణా పరిష్కారాల దిశగా అడుగులు వేస్తున్నారు. వాటిలో శాశ్వత ఆర్టీసీ బస్ స్టేషన్ కూడా ఉంది.
🔹 ప్రణాళికాబద్ధంగా 4 వేల ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచారు.
🔹 ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 1 వరకు ప్రత్యేక ఆర్టీసీ సేవలు
🔹 సజావుగా కార్యకలాపాల కోసం వందలాది మంది అధికారులు, సిబ్బంది
🔹 గద్దెలకు దగ్గరగా సురక్షితమైన, ఇబ్బందిలేని ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులను ఎంచుకోవాలని భక్తులను కోరారు
🔹 పిల్లలు తప్పిపోయిన సంఘటనలను నివారించడానికి చైల్డ్ ట్రాకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు.
కీలక దీర్ఘకాలిక కార్యక్రమాలు:
- ములుగు జిల్లాకు రూ.5 కోట్ల శాశ్వత ఆర్టీసీ బస్ డిపో మంజూరు
- ఏటూరునాగారంలో రూ.7 కోట్ల ఆర్టీసీ బస్ డిపోకు ఆమోదం
మంగపేట, ములుగు, ఇతర మండలాల్లో మినీ బస్ స్టేషన్ల మంజూరు. మేడారం అభివృద్ధి పనులన్నీ షెడ్లు, క్యూలైన్లు, సౌకర్యాలు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మాస్టర్ ప్లాన్ ప్రకారం అమలుచేస్తున్నారు. లక్షలాది మంది భక్తులకు సురక్షితమైన, నమ్మదగిన, గౌరవప్రదమైన ప్రయాణాన్ని అందించనున్నారు.
