- అన్ని కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలి
- జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్
సూర్యాపేట : జిల్లాలో నిర్వహించే టెట్ పరీక్షను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ యస్.వెంకట్రావ్ అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో,ఈ నెల 15 న టెట్ పరీక్ష నిర్వహణ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్లు సి.హెచ్. ప్రియాంక, ఏ. వెంకట్ రెడ్డి తో కలసి కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పేపర్ (1) ఉదయం 9.30 నుండి మద్యాహ్నం 12.00 గం.ల వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని జిల్లాలోని సూర్యాపేట 30, అలాగే కోదాడలో 1 కేంద్రం మొత్తం 31 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని సూర్యాపేట లో 7200 మంది అలాగే కోదాడలో 197 మంది మొత్తం 7397 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. అదేవిదంగా మద్యాహ్నం నిర్వహించే పేపర్ (2) పరీక్షకు సూర్యాపేట లో 28 కేంద్రాలు, కోదాడలో 1 కేంద్రం మొత్తం 29 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని మద్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5 గంటలవరకు పరీక్ష నిర్వహిచడం జరుగుతుందని,సూర్యాపేటలో 6654 మంది, కోదాడలో 10 మంది మొత్తం 6664 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు.పరీక్ష నిర్వహణ సందర్బంగా ఆరు రూట్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్ని కేంద్రాలలో సి.సి. కెమెరాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. పరీక్ష రోజున అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ తప్పక అమలు చేయాలని, నిరంతర విద్యుత్, త్రాగునీరు,ఎ.ఎన్.ఎం తో మెడికల్ స్టాల్ ఏర్పాటు చేయాలని సూచించారు.అభ్యర్థులు ఎక్కడకూడా ఇబ్బంది పడకుండా రూట్ల వారీగా బస్ లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ముందుగా చీఫ్ సూపురిండెంట్లకు పరీక్ష నిర్వహణ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని , ఈ పరీక్ష నిర్వహణకు 31 మంది చీఫ్ సూపరిండెంట్లు, అలాగే జిల్లా అధికారులు, 123 మంది హాల్ సూపరిండెంట్లు, 309 మంది ఇన్విజిలేటర్స్ లను నియమించడం జరిగిందని అన్నారు. పరీక్ష నిర్వహణలో ఎక్కడకూడా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అనుబంధ శాఖల అధికారులు నిబద్ధతతో పనిచేయాలని ఈ సందర్బంగా కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో ఏ. యస్.పి. నాగేశ్వర రావు, డి.ఈ. ఓ అశోక్, డి.యస్.పి. రవి అనుబంధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తప్పక చదవండి
-Advertisement-