ఘట్కేసర్ సర్కిల్కు నూతన డిప్యూటీ కమిషనర్గా వాణి రెడ్డి శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధిత ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం వాణి రెడ్డి మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండే పాలన అందించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ప్రజల సమస్యల పరిష్కారానికి తక్షణ స్పందన ఉండే విధంగా పనిచేస్తామని అన్నారు. ఘట్కేసర్ సర్కిల్ను శాంతియుతంగా, సురక్షితంగా తీర్చిదిద్దేందుకు సమిష్టి కృషి చేస్తామని పేర్కొన్నారు.
- Advertisement -
- Advertisement -
