- ఘనంగా సత్కరించిన అధికారులు, ఇతర సిబ్బంది..
జలమండలిలో పనిచేస్తున్న పన్నెండు మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. వారిని మంగళవారం అనగా 03.02.2026 తేదీ నాడు.. ఖైరతాబాద్ లోని బోర్డు ప్రధాన కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. పదవీ విరమణ ద్వారా లభించే గ్రాట్యూటీ వంటి తదితర ప్రయోజనాలు చెక్కు రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో పీ అండ్ ఏ జీఎం సరస్వతి, డీజీఎం హరి శంకర్ తోపాటు పలువురు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -
