పునాది రాయి వేయడం గొప్ప కాదు.. అది శిఖరమై నిలబడటం గొప్ప.. శిలాఫలకాలు సాక్ష్యం చెబితే సరిపోదు.. ఆ పని తాలూకు ఫలితం ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలి.. ప్రారంభోత్సవం ఆడంబరం కావచ్చు.. కానీ ‘సమర్పణ’ మాత్రమే అసలైన అధికారం.. దుమ్ము పట్టిన శిలాఫలకాలు పాలకుల వైఫల్యానికి నిలువుటద్దాలు. మాటల కంటే పనులే గట్టిగా మాట్లాడాలి. శంకుస్థాపన అనేది ఒక వాగ్దానం. దాన్ని పూర్తి చేయకపోవడం అంటే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడమే. ఒక ప్రాజెక్టు పూర్తయి, రిబ్బన్ కట్ చేసిన రోజున వచ్చే తృప్తి.. వంద శంకుస్థాపనల కంటే విలువైనది.
- Advertisement -
