వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామపంచాయతీ మూడో వార్డు సభ్యునిగా గెలుపొందిన తొర్రి లక్ష్మణ్ సోమవారం జరిగిన జనరల్ బాడీ మీటింగ్ సందర్భంగా, తన పదవ తరగతి చెందిన పలువురు స్నేహితులు పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు స్నేహితులు మాట్లాడుతూ వార్డు సభ్యునిగా గెలవడం ప్రజాసేవకు తొలిమెట్టని భవిష్యత్తులో ఉన్నత పదవులు చేపట్టాలని కోరుతూ, నిరంతరం గ్రామ సమస్యలను తీర్చే విధంగా కృషి చేయాలని పలువురు స్నేహితులు సూచించారు. ఈ కార్యక్రమంలో అరిగెల రామకృష్ణ, చిర్ర మహేందర్, తంశెట్టి శ్రీధర్, బైరు రాజు, గాలి దేవేందర్ తదితరులు పాల్గొని అభినందించారు.
- Advertisement -
