తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు కొత్తగా మరో ముగ్గురు సభ్యులు నియమితులయ్యారు. సి. చంద్రకాంత్ రెడ్డి, ఐపీఎస్ అధికారి విశ్వప్రసాద్, ప్రొఫెసర్ ఎల్.బి లక్ష్మీకాంత్ రాథోడ్లను టీజీపీఎస్సీ నూతన సభ్యులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరి నియామకానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపినట్లు సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ముగ్గురు సభ్యులు ఆరేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారని తెలిపారు.
TGSPSC | పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ముగ్గరు సభ్యులు
RELATED ARTICLES
- Advertisment -