టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
బీఆర్ఎస్ పార్టీ (Brs Party) మాదిరిగా ఇతరుల కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చడం కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి అలవాటులేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (Tpcc) అధ్యక్షుడు (President) మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తమ ఫ్యామిలీలో వివాదాలు క్రియేట్ చేసిందని మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) తల్లి స్వయంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. గోపీనాథ్ తల్లి, కుమారుడి ఆరోపణలపై కేటీఆర్ సమాధానం చెప్పాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీ (Bjp) రెండూ ఒక్కటేనని అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(JubileeHills Bye Election)లో బీఆర్ఎస్కు బీజేపీ సపోర్టు చేస్తోందని పేర్కొన్నారు.
- Advertisement -
