వరల్డ్ ఎకనమిక్ ఫోరం(WEF) వార్షిక సదస్సు–2026లో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్(Zurich) నగరానికి చేరుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రతినిధి బృందానికి జ్యూరిచ్ విమానాశ్రయంలో ప్రవాస తెలంగాణవాసులు ఘన స్వాగతం(Grand Welcome) పలికారు.
✳️ స్విట్జర్లాండ్లోని భారత రాయబారి(Indian Ambassador to Switzerland) మృదుల్ కుమార్(Mridul Kumar), ఇతర అధికారులు జ్యురిచ్ ఎయిర్ పోర్టులో సీఎంకి ఆత్మీయ స్వాగతం పలికి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
✳️ దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. మరోవైపు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇప్పటికే దావోస్కు చేరుకున్నారు.
✳️ దావోస్లో 4 రోజుల పాటు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సమావేశాల్లో తెలంగాణ ప్రతినిధి బృందం పాల్గొననుంది.
✳️ సమావేశాల తొలి రోజున వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ కంపెనీల పారిశ్రామికవేత్తలతో జరిగే సమావేశాల్లో సీఎం పాల్గొంటారు.
✳️ ఈ సందర్భంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ రోడ్మ్యాప్ను ప్రపంచ వేదికపై పరిచయం చేయనున్నారు.
✳️ రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి లక్ష్యాలు, ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని వివరించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు.
✳️ డిసెంబర్లో ప్రభుత్వం ఆవిష్కరించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్లో ప్రతిపాదిత అభివృద్ధి నమూనాకు అనుగుణంగా సుస్థిర పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ WEF–2026లో తన అజెండాను ముందుకు తీసుకెళ్లనుంది.
