Saturday, February 14, 2026
Homeఎన్‌.ఆర్‌.ఐWEF | జ్యూరిచ్‌కి చేరుకున్న సీఎం రేవంత్ బృందం

WEF | జ్యూరిచ్‌కి చేరుకున్న సీఎం రేవంత్ బృందం

వరల్డ్ ఎకనమిక్ ఫోరం(WEF) వార్షిక సదస్సు–2026లో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్(Zurich) నగరానికి చేరుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రతినిధి బృందానికి జ్యూరిచ్ విమానాశ్రయంలో ప్రవాస తెలంగాణవాసులు ఘన స్వాగతం(Grand Welcome) పలికారు.
✳️ స్విట్జర్లాండ్‌లోని భారత రాయబారి(Indian Ambassador to Switzerland) మృదుల్ కుమార్(Mridul Kumar), ఇతర అధికారులు జ్యురిచ్ ఎయిర్ పోర్టులో సీఎంకి ఆత్మీయ స్వాగతం పలికి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
✳️ దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. మరోవైపు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇప్పటికే దావోస్‌కు చేరుకున్నారు.
✳️ దావోస్‌లో 4 రోజుల పాటు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సమావేశాల్లో తెలంగాణ ప్రతినిధి బృందం పాల్గొననుంది.

✳️ సమావేశాల తొలి రోజున వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ కంపెనీల పారిశ్రామికవేత్తలతో జరిగే సమావేశాల్లో సీఎం పాల్గొంటారు.
✳️ ఈ సందర్భంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ రోడ్‌మ్యాప్‌ను ప్రపంచ వేదికపై పరిచయం చేయనున్నారు.
✳️ రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి లక్ష్యాలు, ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని వివరించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు.
✳️ డిసెంబర్‌లో ప్రభుత్వం ఆవిష్కరించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌లో ప్రతిపాదిత అభివృద్ధి నమూనాకు అనుగుణంగా సుస్థిర పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ WEF–2026లో తన అజెండాను ముందుకు తీసుకెళ్లనుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News