సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహాంతి
హైదరాబాద్: సైబరాబాద్ సెక్యూరిటి కౌన్సిల్ (Cyberabad Security Council) 2024-25 సంవత్సరానికి సంబంధించిన వార్షిక సాధారణ సమావేశాన్ని టీ హాబ్ (T hub) సెంటర్లో శనివారం నిర్వహించారు. ఈ సమావేశం చైర్మన్ అవినాష్ మహంతి (Avinash Mahanti) ఆధ్వరంలో జరిగింది. రమేష్ ఎస్సీఎస్సీ కార్యదర్శి, సీఈఓ నవేద్ఖాన్ తోపాటు వివిధ సంస్థల(స్కూల్, కాలేజ్, ఆసుపత్రులు, హోటల్స్, స్టార్టప్స్) ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎస్సీఎస్సీ ముఖ్యమైన భద్రత, సురక్ష, సంక్షేమ కార్యక్రమాలపై సమిక్షీంచారు. భవిష్యత్తుకు దారితిసే మార్గలపై చర్చించారు.మహిళలలు పిల్లలు యువత భద్రత ఫోరం సాగమిత్ర సురక్ష కవచ అత్మరక్షణ వంటి కార్యక్రమాలు విజయవంతం నిర్వహించినట్లుఫోరంతెలిపింది.
రోడ్సేఫ్టి ట్రాఫిక్ మేనేజ్మెంట్ మార్షల్స్ సంఖ్యను 135నుండి 200వరకు పెంచే దిశగా అడుగులు,ఎలాక్ట్రానిక్ సర్వేలేన్స్ విస్తరణ,పై పాఠశాలకు కళశాలకు విస్తరించడానికి ప్రణాళికలు ప్రకటించారు.కోత్త ప్రాజేక్టు హాస్టల్,పీజీ భద్రత,ఆడిట్ ప్రదర్శించే వెబ్సైట్ ప్రారంభం.ఈవీ ఆధారిత పెట్రోలింగ్ వాహానాలు విద్యాసంస్థలు కమ్యూనిటిలకు సురక్ష కవచ వంటి కొత్త కార్యక్రమాలు ప్రకటించబడ్డాయి.ఈకార్యమ్రంలో ట్రాఫీక్ మార్షల్ శివ,కే యాదవ్ను రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కాపాడినందుకు ప్రత్యేకంగా కమిషనర్ అభినందించి సత్కరించారు.
ఈ సమావేశం ఎస్సీఎస్సీ ఆర్థిక పనితీరు సమీక్షీంచి పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యాల (PPP) ద్వారా నిరంతరం వృద్ధిని గుర్తించి హైదరాబాద్ను ఒక భద్రతపూర్యక సురక్షీతమైన వ్యాపార అనుకూల నగరంగా మార్చేందుకు ఒక మిషన్పై చర్చించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ఎన్.కోటిరెడ్డి, డీసీపీ కే.సురేష్కుమార్, డీసీపీ రితురాజ్, డీసీపీ యోగేష్గౌతమ్, డీసీపీ రాజేష్, డీసీపీ శ్రీసాయి, డీసీపీ ముత్యంరెడ్డి, డీసీపీ సూర్జన కర్ణనం, డీసీపీ రాజరతన్కుమార్, డీసీపీ షోబన్కుమార్, డీసీపీ సంజయ్తోపాటు ఇతర అధికారులుపాల్గోన్నారు.
