మణిపూర్(Manipur), మేఘాలయ(Meghalaya), త్రిపుర(Tripura) రాష్ట్రాల అవతరణ దినోత్సవాల(Statehood Day celebrations)ను హైదరాబాద్ (Hyderabad)లోని లోక్భవన్(Lok Bhavan)లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’(Ek Bharat Shreshtha Bharat)లో భాగంగా ఏర్పాటుచేసిన ఈ సెలబ్రేషన్స్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్(Governor of Telangana) జిష్ణుదేవ్వర్మ(Jishnu Dev Varma) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మన దేశంలోని భిన్నత్వంలో ఏకత్వం గొప్పతనాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. అద్భుతమైన ఈశాన్య ప్రాంత సాంస్కృతిక వారసత్వం గురించి వివరించారు. మణిపూర్, మేఘాలయ, త్రిపురలను కీలక పర్యాటక ప్రదేశాలుగా ప్రోత్సహించాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు. ఈ వేడుకల్లో ప్రదర్శించిన మూడు రాష్ట్రాల సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆయా రాష్ట్రాల గవర్నర్ల సందేశాలను చదివి వినిపించారు.
Hyderabad Lok Bhavan | 3 రాష్ట్రాల అవతరణ దినోత్సవాలు
- Advertisement -
RELATED ARTICLES
