Thursday, February 12, 2026
Homeస్పోర్ట్స్Centuries | శతకాల మోత.. ఒకే రోజు 7 సెంచరీలు..

Centuries | శతకాల మోత.. ఒకే రోజు 7 సెంచరీలు..

విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy)లో శతకాల మోత మోగింది. ఒక్క రోజే ఏడు సెంచరీలు(Seven Centuries) నమోదవటం విశేషం. విరాట్ కోహ్లీ(Virat Kohli) 83 బాల్స్‌కే సెంచరీ చేశాడు. ఢిల్లీ తరఫున ఆడిన కింగ్ కోహ్లీ తన జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర బ్యాటర్ రికీ భుయ్ కూడా శతకం బాదాడు. ముంబై, సిక్కిం మ్యాచ్‌లో రోహిత్ శర్మ(Rohit Sharma) సైతం సెంచరీ చేసి అలరించాడు. అరుణాచల్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బీహార్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) ఏకంగా 190 పరుగులు చేసి డబుల్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. బీహార్ జట్టులోని మరో ఇద్దరు ప్లేయర్లు ఆయుష్ లోహరుక, సకిబుల్‌గని సెంచరీలు నమోదు చేశారు. కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో జార్ఖండ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 33 బంతుల్లోనే శతకం చేశాడు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News