నేడే తొలి మహిళ ఉపాధ్యాయురాలి దినోత్సవం అని ఎంతమందికి తెలుసు, ప్రత్యేకంగా అమ్మాయిలకు, మహిళలకు.. ఈరోజు బలహీనవర్గాల మహిళలు చదువుకుంటున్నారంటే, ఆ రోజుల్లో సావిత్రిబాయి చేసిన కృషి వల్ల అన్ని మీకు ఎందరికీ తెలుసు.. సావిత్రిబాయి పూలే కోసం మనకు తెలిసింది గోరంత, తెలుసుకోవలసింది కొండంత.. మహిళలకు చదువు, మహిళను సమాజం పట్టి పీడిరచిన బాల్యవివాహలకు, మూఢనమ్మకాలకు, సతీసహగమనానికి వితంతువులకు శిరోముండనం చేయడాన్ని తీవ్రంగా ఖండిరచిన గొప్ప సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే.. అలాంటి గొప్ప మహనీయురాలిని స్మరించుకుంటూ, ప్రతి ఒక్కరూ వేడుకగా జరుపుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
- కుమ్మరి రాజు
- Advertisement -
