సిగాచి (Sigachi) పరిశ్రమలో జరిగిన ప్రమాదానికి సంబంధించి బాధితులకు(Victims) పెండింగ్ (Pending)లో ఉన్న నష్టపరిహారాన్ని(Compensation) వెంటనే అందించాలని ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి ఎమ్మెల్యే (Sangareddy Mla) చింత ప్రభాకర్ ప్రభుత్వాన్ని కోరారు. అదే విధంగా కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి (Minister Vivek Venkat Swami) చెప్పిన తప్పుడు లెక్కలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్కి, ఎస్పీకి వినతిపత్రాలు సమర్పించారు. హైకోర్టు ఆదేశాల మేరకు.. సిగాచి ఘటన కారకులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే (Zaheerabad MLA) మాణిక్ రావు(Manik Rao), మాజీ సీడీసీ చైర్మన్ వెంకటేశ్వర్లు, పటాన్చెరు మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
