Wednesday, February 11, 2026
Homeఆంధ్రప్రదేశ్Amaravati | గణతంత్ర దినోత్సవాల్లో సీఎం చంద్రబాబు

Amaravati | గణతంత్ర దినోత్సవాల్లో సీఎం చంద్రబాబు

అమరావతిలో సోమవారం జరిగిన గణతంత్ర దినోత్సవాల్లో(Republic Day Celebrations) సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం(Deputy CM) పవన్ కళ్యాణ్(Pawan Kalyan), మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ప్రతి రిపబ్లిక్ డే గర్వించదగ్గ, చిరస్మరణీయమైన సందర్భం అయినప్పటికీ ఈ సంవత్సరం వేడుకలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేకంగా ఆదరించారని చంద్రబాబు చెప్పారు. ప్రజా రాజధాని అమరావతిలో తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ఈ గణతంత్ర దినోత్సవం ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందని తెలిపారు. ఈ ముఖ్యమైన సందర్భం నేపథ్యంలో ప్రభుత్వ అజెండాను, దార్శనికతను అనర్గళంగా వివరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్‌(Governor Abdul Nazeer)కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ సమిష్టి ఆకాంక్షలను, భవిష్యత్తు దార్శనికతను ప్రతిబింబిస్తూ గ్రాండ్ కవాతును, అందంగా రూపొందించిన శకటాలను చూడటం ఆనందంగా ఉందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News