డిప్యూటీ సీఎం (Deputy CM) మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhattivikramarka) తన సొంత నియోజకవర్గం మధిర(Madhira)లో పర్యటించారు. ముదిగొండ మండలం గంధసిరి గ్రామంలో పురాతన ఆలయ (Old Temple) పునర్నిర్మాణ పనులకు (Reconstruction Works) శంకుస్థాపన (Foundation Stone Laying) చేశారు. కాకతీయుల (Kakatiya) యుగానికి చెందిన శ్రీ సుందర మౌలేశ్వర స్వామి (Sundara Mauleswara Swamy) గుడిని తిరిగి నిర్మించేందుకు రూ.2 కోట్లు వెచ్చిస్తున్నారు. ఈ పనులను తన చేతుల మీదుగా ప్రారంభించటం సంతోషంగా ఉందని భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రాంతీయ చరిత్ర, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఈ దేవాలయ పునర్నిర్మాణంతో గంధసిరి గ్రామం మళ్లీ ఆధ్యాత్మిక మహిమను సంతరించుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
- Advertisement -
