- కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లారెడ్డి
సంక్రాంతి సంబరాల్లో భాగంగా జిహెచ్ఎంసి పరిధిలోని కిష్టాపూర్ – పూడూర్ సర్కిల్ పరిధిలో గల కెఎల్ఆర్ వెంచర్ లో మేడ్చల్ మున్సిపాలిటీ మాజీ కో ఆప్షన్ సభ్యులు ఆకిటి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మల్లారెడ్డి మాట్లాడుతూ నన్ను ఆదరిస్తున్న మేడ్చల్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కరించి రుణం తీర్చుకుంటానన్నారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో నిత్యం సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గత పదేళ్లుగా రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని గుర్తు చేశారు. ఇక రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమని, ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎవరి దమ్ము ఎంతుందో చూసుకుందామని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు భాస్కర్ యాదవ్ కోల వెంకటేష్ శేఖర్ రెడ్డి బాబు యాదవ్ మాజీ కౌన్సిలర్ గణేష్ నర్సింగ్ గౌడ్ దయానంద్ యాదవ్ రాజ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

