కీసర ఆర్డీవోగా రాజేష్ కుమార్ నియమితులయ్యారు. రాజేష్ కుమార్ గతంలో కీసర ఆర్డీఓగా, కీసర మండల తహసీల్దార్గా బాధ్యతలు నిర్వర్తించారు. కీసర రెవెన్యూ డివిజన్ అధికారి (ఆర్డీఓ) కె.వెంకట ఉపేందర్ రెడ్డిని రవాణా, రోడ్డు భవనాల శాఖ (హౌసింగ్) కు బదిలీ చేసిన ప్రభుత్వం అక్కడ డిప్యూటేషన్పై విధులు నిర్వహిస్తున్న రాజేష్ కుమార్ను కీసర ఆర్డీవోగా నియమించారు. శుక్రవారం ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
- Advertisement -
