Thursday, April 9, 2026
HomeజాతీయంPM Modi | ఈసారి మమతకు ఓటమి తప్పదు..

PM Modi | ఈసారి మమతకు ఓటమి తప్పదు..

  • తీవ్ర వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోడీ..
  • చరిత్ర పునరావృతం అవుతుందన్న ప్రధాని..

పశ్చిమబెంగాల్‌ లోని హల్దియాలో ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఐదేళ్ల క్రితం నందిగ్రామ్‌లో సీఎం మమతాబెనర్జి ఓటమిని గుర్తుచేస్తూ.. ఈసారి పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం అంతటా అదే ఫలితం పునరావృతమవుతుందని చెప్పారు. పశ్చిమబెంగాల్‌ మార్పును కోరుకుంటోందని, ఈ క్రమంలో బీజేపీ భారీ విజయాన్ని చూస్తామని వ్యాఖ్యానించారు.

నందిగ్రామ్‌లో ఐదేళ్ల క్రితం ఏం జరిగిందో ఇప్పుడు భవానీపూర్‌తోపాటు మొత్తం బెంగాల్‌లోనూ అదే ఫలితం వస్తుందని ప్రధాని జోష్యం చెప్పారు. ఇవి సాధారణ ఎన్నికలు కావని, ఈ ఎన్నికలు అభివృద్ధికి, బెంగాల్‌ చరిత్రను తిరగరాయడానికి ఎంతగానో తోడ్పడతాయని అన్నారు. భారత్‌ ఎంతో వేగంగా అభివృద్ధి చెందినప్పటికీ టీఎంసీ ప్రభుత్వం బెంగాల్‌ అభివృద్ధికి అడ్డుపడుతోందని విమర్శించారు. ప్రైవేటు సెక్టార్లలో సామాన్యులను ఉద్యోగాల నుంచి తొలగించి చొరబాటుదారులకు అవకాశం కల్పిస్తోందని ఆరోపించారు.

- Advertisement -

బీజేపీ అధికారంలోకి రాగానే రాజ్యాంగం ప్రకారం టీఎంసీ చేసిన మోసాలను బయటకు తీస్తామని, బెంగాల్‌ యువతకు వ్యతిరేకంగా తృణమూల్‌ చేసిన పాపాలు వందేళ్లు గడిచినా తొలగిపోవని మోదీ వ్యాఖ్యానించారు. ఒక్కసారి డబుల్‌-ఇంజిన్‌ సర్కార్‌ అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ ఇక్కడ అమల్లోకి వస్తాయని చెప్పారు. బెంగాల్‌ ప్రజలకు ఆరు హామీలు ఇస్తున్నానని అన్నారు. అన్యాయానికి గురైన ఆడబిడ్డల కేసులను తిరగదోడుతామని, అవినీతికి సాయం చేస్తున్న చట్టాలను రూపుమాపుతామని తెలిపారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News