- సిరిసిల్ల సెస్ విద్యుత్ చైర్మన్ మరియు ఎం.డి.కి వినతి పత్రం అందజేసిన నీలోజిపల్లి సర్పంచ్ భాస్కర్
బోయిన్ పల్లి మండలంలోని నీలోజీ పల్లి గ్రామంలో విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరుతూ నీలోజుపల్లి సర్పంచ్ అనుముల భాస్కర్, శనివారం నాడు సిరిసిల్ల సెస్ విద్యుత్ చైర్మన్ చిక్కాల రామారావు ను సెస్ ఎం డి భిక్షపతి లను కలసి వినతి పత్రం ఇచ్చారు. నీలోజిపల్లి గ్రామంలో గత కొన్ని నెలల క్రితం గుర్తు తెలియని దొంగలు విధ్యుత్ వైర్లు దొంగలించడంతో నీలోజీ పల్లి గ్రామంలోని స్మశానం వాటికలో నిహరిత హారం మొక్కలకు నీరు అందించేందుకు అలాగే దహన సంస్కారాలకు ఇబ్బంది ఏర్పడిరదని, అలాగే ఎస్ సి కాలనీలో కూడ ఇబ్బంది ఉందని వినతి పత్రంలో కోరగా వెంటనే వారు స్పందిందించి విధ్యుత్ పునరుద్ద రిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. సర్పంచ్ భాస్కర్ వెంట మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు కొనుకటి నాగరాజు తదితరులు న్నారు.
