సింగరేణి లాంటి ప్రజా సంస్థలు ప్రభుత్వాల ఆస్తి కాదు, ప్రజల నమ్మకం. నైనీ టెండర్ వివాదం ఆ నమ్మకాన్ని వమ్ము చేసింది.. పారదర్శకత ఉండాల్సిన చోట మౌనం.. సమాధానాలు ఉండాల్సిన చోట తప్పించుకునే ధోరణి.. సింగరేణి బొగ్గు గనుల్లో ప్రమాదం లేదు.. అవినీతిలోనే అసలైన ప్రమాదం దాగి వుంది.. టెండర్ ప్రక్రియలు న్యాయంగా, స్పష్టంగా లేకపోతే అది సంస్థ ప్రతిష్టపై పడిన నల్ల మచ్చ. నైనీ టెండర్ వివాదం ఒక ఒప్పందం మాత్రమే కాదు.. ఒక వ్యవస్థ సమూల విశ్వసనీయత అని గుర్తించాలి..
- Advertisement -
