ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు (Palvai Harish Babu) శనివారం వేంకటేశ్వర స్వామి (Venkateswara Swami) బాలాలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగజ్నగర్ పట్టణం (Kagaznagar Town) ఆర్ఆర్ఓ క్యాంప్(ROR Camp)లోని వేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీశ్రీశ్రీ రామచంద్ర జీయర్ స్వామివారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా స్వామి వారు మాట్లాడుతూ.. గోదా, లక్ష్మీ అమ్మవార్లతోపాటు వేంకటేశ్వర స్వామి ఆలయ (Temple) పునరుద్ధరణకు భగవత్ బంధువులందరూ సహకరించాలని కోరారు. పాల్వాయి హరీష్ బాబు.. మాట్లాడుతూ భవ్యమైన వేంకటేశ్వర స్వామి వారి నూతన మందిర నిర్మాణానికి సహకరిస్తానని తెలిపారు.
- Advertisement -
