విశాఖపట్నం(Vishakapatnam)లో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో శనివారం సీఎం చంద్రబాబు (CM Chandrababu) కోర్డెలియా క్రూయిజెస్ (Cordelia Cruises) ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తీర పర్యాటకాన్ని అంతర్జాతీయ స్థాయి(International level)కి తీసుకెళ్లడమే లక్ష్యమని, ఇందుకు కోర్డెలియా క్రూయిజెస్ కలిసి రావాలని కోరారు. విశాఖ–కాకినాడ–భీమునిపట్నం పోర్టుల నుంచి క్రూయిజ్ టూరిజం సేవలు అందించడంపై చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా క్రూయిజ్ టెర్మినల్ సౌకర్యాలు, బీచ్ టూరిజం, వాటర్ అడ్వెంచర్ స్పోర్ట్స్పై కోర్డెలియా క్రూయిజెస్ ఆసక్తి కనబరిచింది.
- Advertisement -
