మావోయిస్టు పార్టీ (Maoist Party) అగ్ర నేతలు మల్లోజుల వేణుగోపాల్ (Mallojula Venugopal), ఆశన్న (Ashanna) పోలీసుల ఎదుట లొంగిపోయిన నేపథ్యంలో ఆ పార్టీ కేంద్ర కమిటీ స్పందించింది. ఆ ఇద్దరిని పార్టీ నుంచి బహిష్కరించింది. ఈ లొంగుబాట్లు విప్లవ ఉద్యమాన్ని ఆపలేవని, అంతిమంగా విప్లవానిదే విజయమని పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో విడుదలైన లేఖలో పేర్కొన్నారు. 50 ఆయుధాలను శత్రువులకు అప్పగించడం విప్లవాన్ని హత్య చేయడమేనని, శత్రువుకు లొంగిపోయినవారు విప్లవ ప్రతిఘాతకులు, విచ్ఛిత్తి ద్రోహులని విమర్శించారు.
- Advertisement -
