Friday, September 12, 2025
ePaper
spot_img
Homeరాజకీయంప్రధాని మోదీని కలుద్దాం రండి

ప్రధాని మోదీని కలుద్దాం రండి

అన్ని పార్టీల్లోని బీసీ నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు

బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీలకు మద్దతు గురించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను కలిసి మాట్లాడటం సరికాదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఆమె బలహీన వర్గాల గురించి మాట్లాడి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీసీ విజన్‌పై పార్లమెంట్ సాక్షిగా బల్లగుద్ది చెప్పారని గుర్తుచేశారు. తెలంగాణలో బీసీలు 56 శాతం మంది ఉన్నారనేది వాస్తవమని తెలిపారు. తమతో ఎవరైనా కలిసి రావచ్చని, రాజకీయాలకు అతీతంగా బీసీ రిజర్వేషన్లపై ప్రధాని మోదీని కలుద్దామని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News