చిత్తూరు జిల్లా(Chittoor District)లో ఏర్పాటుచేసిన కుంకీ (Kumki) ఏనుగుల (Elephants) కేంద్రాన్ని ఏపీ డిప్యూటీ సీఎం (Deputy CM) పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అటవీ శాఖ సమీక్ష నిమిత్తం చిత్తూరు జిల్లా పలమనేరుకు చేరుకున్న ఆయన.. మండలంలోని ముసలిమడుగులో 20 ఎకరాల్లో ఏర్పాటుచేసిన ఏనుగుల కేంద్రానికి వెళ్లారు. కుంకీ ఏనుగులకు ఆహారం (Food) పెట్టారు. వాటి విన్యాసాలను చూశారు. జనావాసాల్లోకి, పంట పొలాల్లోకి వచ్చే అడవి ఏనుగులను కట్టడి చేసేందుకు కర్ణాటక (Karnataka) నుంచి నాలుగు కుంకీ ఏనుగులను తీసుకొచ్చినట్లు అధికారులు పవన్ కళ్యాణ్కు చెప్పారు. అంతకుముందు.. ఆయన.. హెలిప్యాడ్ దగ్గర ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
- Advertisement -
