జూబ్లీహిల్స్ (JubileeHills) నియోజకవర్గంలోని యూసుఫ్గూడ డివిజన్ కమలాపురి కాలనీలో రాజేంద్ర గాంధీ, కరణ్ గాంధీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం(Spiritual Communion)లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి (Congress Party Candidate) నవీన్ యాదవ్ పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు, అభిమానులతో ఆత్మీయంగా కలిసిపోయారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నమ్మకానికి ప్రతీకగా నిలుస్తోందని, యువత(Youth)కు అవకాశాలు, మహిళలకు భద్రత, ప్రతి కుటుంబానికి (Family) అభ్యున్నతి కల్పించడం పార్టీ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

