- ఒక్కసారిగా కుప్పకూలిన మార్కెట్..
- 6 కీలక అంశాలే కారణం..
భారతీయ స్టాక్ మార్కెట్లో శుక్రవారం బ్లాక్ ఫ్రైడేగా మిగిలిపోయింది. గత రెండు రోజులుగా లాభాల్లో ఉన్న మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. సెన్సెక్స్ ఏకంగా 1,642 పాయింట్లు పతనమై 73,631 వద్ద ముగియగా, నిఫ్టీ 438 పాయింట్లు క్షీణించి 22,900 మార్కు కిందకు పడిపోయింది. ఈ భారీ పతనం వల్ల ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ. 8 లక్షల కోట్లు ఆవిరి అయిపోయింది. అసలు స్టాక్ మార్కెట్ ఇలా ఒక్కసారిగా పడిపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తే సామాన్యులకు కూడా అర్థమయ్యే 6 కీలక అంశాలు కనిపిస్తున్నాయి..
- రికార్డు కనిష్టానికి రూపాయి పతనం.. 2. కొనసాగుతున్న ఇరాన్ – అమెరికా యుద్ధం.. 3. మండుతున్న ముడి చమురు ధరలు.. 4. విదేశీ ఇన్వెస్టర్ల వెనకడుగు.. 5. అమెరికా బాండ్ యీల్డ్స్ పెరుగుదల.. 6. రిలయన్స్ , విండ్ఫాల్ టాక్స్ షాక్
- Advertisement -
