- అందుకే కేకేఆర్ నుండి బయటకు వచ్చా
- శ్రేయాస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు
ఐపీఎల్ 2024లో కోల్కతా నైట్ రైడర్స్కు టైటిల్ అందించిన శ్రేయాస్ అయ్యర్ ఆ వెంటనే జట్టును వీడాడు. అసలు కేకేఆర్ నుంచి ఎందుకు బయటకు వచ్చాడని అప్పట్లో తెగ రూమర్స్ వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వాటన్నింటికి క్లారిటీ ఇచ్చాడు. పంజాబ్ కింగ్స్లో తనకు లభించిన గౌరవం కేకేఆర్లో లేదని తెలిపాడు. పంజాబ్ జట్టులో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోగలిగానని, కేకేఆర్లో మాత్రం చర్చల్లో భాగస్వామినే కానీ పూర్తి స్వేచ్ఛ లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్గా పేరు తెచ్చుకున్న శ్రేయాస్ అయ్యర్.. కోల్కతా నైట్ రైడర్స్కి ట్రోఫీ అందించి బయటకొచ్చాడు. కేకేఆర్ ఫ్రాంఛైజీనే అయ్యర్ని వదిలేసిందని కొందరు అంటుంటే.. తానే బయటకు వచ్చానని శ్రేయాస్ అయ్యర్ అంటున్నాడు. పంజాబ్ కింగ్స్లో దక్కిన గౌరవం.. కేకేఆర్లో లేదంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ను ఫైనల్కు చేర్చి వెంట్రుకవాసిలో టైటిల్ను కోల్పోయిన శ్రేయాస్ అయ్యర్ .. కేకేఆర్లో తాను పూర్తిగా ఇమడలేక పోయానని ఎమోషనల్ అయ్యారు. చర్చల్లో భాగంగా మాత్రమే ఉన్నానని, కానీ పూర్తి స్థాయి స్వేచ్ఛ దక్కలేదని చెప్పాడు. అయితే, పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్, కోచ్లు మాత్రం తన మాట వినాలనే తపన చూపారని.. అందుకే కెప్టెన్సీలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకున్నానంటూ వెల్లడిరచాడు. నేను కెప్టెన్గా, ఆటగాడిగా జట్టుకు చాలా ఇస్తాను. నాకు గౌరవం దక్కితేనే అన్నీ సాధ్యమవుతాయి. పంజాబ్ కింగ్స్లో అదే జరిగింది. అక్కడ కోచ్లు, మేనేజ్మెంట్, ఆటగాళ్లు.. అందరూ నాకు అండగా నిలిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఉత్సాహంతో జట్టులో చేరినప్పుడు వాళ్లంతా నా మాట వినాలనే తపన చూయించారు. ఆ కారణంతోనే మైదానంలో, బయటా నేను స్పష్టమైన నిర్ణయాలు తీసుకోగలిగాను. మేనేజ్మెంట్, కోచ్లతో జరిగే ప్రతి మీటింగ్లో పాల్గొని వ్యూహాత్వకంగా సహకరించడం నాకు చాలా ఇష్టం’’ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
ఐపీఎల్ 2024 టైటిల్ గెలిచిన తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ నుంచి శ్రేయాస్ అయ్యర్ బయటకు రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, తాను తీసుకున్న నిర్ణయం వెనుక తెలియని బాధ ఉందని శ్రేయాస్ మాటల్లోనే తెలిసింది. కేకేఆర్లో కెప్టెన్గా వ్యవహరించినప్పటికీ, పంజాబ్లోలా పూర్తి స్వేచ్ఛతో వ్యవహరించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కేకేఆర్లో నేను చర్చల్లో భాగమే అయినా.. పూర్తిగా ఇమడలేక పోయాను. కానీ ఇప్పుడు ఉన్న స్థాయికి రావడానికి మాత్రం చాలా కష్టపడ్డాను అని శ్రేయాస్ అయ్యర్ వెల్లడిరచాడు. ఐపీఎల్, దేశవాళీ, వన్డే క్రికెట్లో రాణించిన శ్రేయాస్ అయ్యర్ను బీసీసీఐ పూర్తి స్థాయిలో గుర్తించకపోవడం బాధాకరం. ఐపీఎల్ తర్వాత ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో ఛాన్స్ ఇవ్వని బీసీసీఐ, ఆసియా కప్ 2025 స్క్వాడ్లో కూడా మొండిచేయి చూయించింది. శ్రేయాస్ను కావాలనే పక్కనబెడుతున్నారన్న విమర్శలు ఎక్కువవ్వడంతో.. ఆస్ట్రేలియా ఏతో జరిగే అనధికారిక నాలుగు రోజుల టెస్టు సిరీస్లో భారత్ ఏ జట్టుకు కెప్టెన్గా ఎంపిక చేశారు.