ఇండియా(India) 2025లో 623.6 టన్నుల బంగారాన్ని(Gold), 7158 టన్నుల వెండి(Silver)ని దిగుమతి(Imports) చేసుకుంది. ఈ 2 లోహాల ధరలు పెరిగినప్పటికీ ఉత్తమ పెట్టుబడి(Best Investment) సాధనంగా భావిస్తుండటం వల్లే ఇంపోర్ట్స్ పెరిగాయి. పోయినేడాది పుత్తడి రేటు 75 శాతం, వెండి ధర 160 శాతం పెరిగాయి. 2024తో పోల్చితే 2025లో స్వర్ణం దిగుమతులు 23.2 శాతం తగ్గాయి. వెండి దిగుమతులు 7669 టన్నుల నుంచి 7158 టన్నులకు తగ్గాయి. 2024లో 812.2 టన్నుల గోల్డ్ ఇంపోర్ట్ కాగా 2025లో 623.6 టన్నులు మాత్రమే దిగుమతి అయింది. ఈ విషయాలను మెటల్స్ ఫోకస్(Metals Focus) సంస్థ వెల్లడించింది. కిందటేడాది ఇండియా దిగుమతి చేసుకున్న బంగారం విలువ 58.84 బిలియన్ డాలర్లు కాగా వెండి ఇంపోర్ట్స్ వ్యాల్యూ 9 బిలియన్ డాలర్లు.
- Advertisement -
