Friday, October 3, 2025
ePaper
Homeబిజినెస్హైదరాబాద్‌ వేదికగా గ్లోబల్‌ సెమీకండక్టర్‌ కాన్‌స్టిట్యూషన్‌

హైదరాబాద్‌ వేదికగా గ్లోబల్‌ సెమీకండక్టర్‌ కాన్‌స్టిట్యూషన్‌

  • సెప్టెంబర్‌ 27 నుంచి 28 వరకు జరగనున్న సదస్సు
  • పాల్గొననున్న ప్రభుత్వ, ప్రైవేట్‌ పరిశ్రమలు, విద్యా మరియు శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన ప్రముఖులు

టెక్నాలజీ చిప్‌ ఇన్నోవేషన్‌ ప్రోగ్రాం (టీ- చిప్‌) ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 27 నుంచి 28 వరకు హైదరాబాద్‌ నగరంలో నిర్వహించబోయే టీ- చిప్‌ సెమీకాన్‌ రాజ్యాంగ సదస్సు 2025 సెమీకండక్టర్‌ రంగానికి ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలవనుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ పరిశ్రమలు, విద్యా, శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన ప్రముఖులు ఈ సదస్సులో భాగస్వాములు కానున్నారు. ఈ సదస్సు ద్వారా ‘గ్లోబల్‌ సెమీకండక్టర్‌ కాన్‌స్టి ట్యూషన్‌’ అనే మార్గసూచక రాజ్యాంగం రూపుదిద్దుకోనుంది. ఈ సదస్సు సాధారణంగా జరిగే సాంకేతిక సమావేశం కాదని, భవిష్యత్తు కోసం ఒక స్పష్టమైన దిశను నిర్దేశించేందుకు తీసుకున్న కీలక ప్రయత్నమని నిర్వాహకులు తెలిపారు. టాలెంట్‌, డిజైన్‌, మాన్యు ఫ్యాక్చరింగ్‌, అప్లికేషన్స్‌ అనే నాలుగు ముఖ్యమైన అంశా లపై ఆధారపడిన టీ-చిప్‌ వ్యూహం ఆధారంగా ఇది సెమీ కండ క్టర్‌ ఆలోచన విధానానికి ప్రతి ఘట్టాన్ని అభివృద్ధి చేసే దిశగా ఒక రోడ్‌మ్యాప్‌గా పని చేయనుంది. ఈ రెండు రోజుల సదస్సులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి కీలక అధికారులతో పాటు ఎలక్ట్రా నిక్స్‌, విద్యా, రక్షణ రంగాలకు చెందిన ప్రతి నిధులు పాల్గొనను న్నారు.

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ వి. బాలకిష్ట రెడ్డి, ప్రధాన యూనివర్సిటీల వైస్‌ చాన్సలర్లు, ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశా లల విభాగాధిపతులు, ఇండియా ఎలక్ట్రా నిక్స్‌ అండ్‌ సెమీకండక్టర్‌ అసోసియేషన్‌ (ఐఈఎస్‌ఏ) డైరెక్టర్‌ డా. కె. జి. విశ్వనాథన్‌, క్వాంటం టెక్నాలజీస్‌ డైరెక్టర్‌ శ్రీ చెల్లె వెంకట రామరాజు తది తరులు పాల్గొంటారు. అంతర్జాతీయ స్థాయిలో తైవాన్‌కు చెందిన నేషనల్‌ యాంగ్‌ మింగ్‌ చియో టంగ్‌ యూని వర్శిటీ (ఎన్‌వై సి యు), తైవాన్‌ సెమీకండక్టర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (టిఎస్‌ఆర్‌ఐ), ఏఆర్‌ఎం, జియుఎస్‌ టెక్నాలజీ సంస్థల ప్రతిని ధులు సదస్సుకు హాజర వుతారు. గస్‌ టెక్నాలజీ సీఈఓ సీసీ ఛాంగ్‌ ప్రత్యేక ఆహ్వానితులుగా రానున్నారు. ఈసదస్సులో ఇండి యన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌ అభివృద్ధి చేసిన స్వదేశీ చిప్‌ను మొట్ట మొదటిసారిగా ప్రజలకు పరిచయం చేయ నున్నారు. ఇది భారత దేశం సెమీకండక్టర్‌ రంగంలో తన సామ ర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేయడంలో ఒక మైలురాయి కానుంది.

ఈ సదస్సులో సెమీ కండక్టర్‌ రంగంపై అనుభవజ్ఞుల ‘‘టి చిప్‌’’ వివిధ సంస్థల మధ్య అవగాహన ఒప్పం దాలపై సంతకాలు జరగను న్నాయి. చివరగా జరిగే నెట్‌వర్కింగ్‌ డిన్నర్‌లో సెమీ కండక్టర్‌ రంగానికి సంబంధించిన ప్రముఖులు భవిష్యత్తు సహకార మార్గాలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా టీ-చిప్‌ చైర్మన్‌ సందీప్‌ కుమార్‌ మక్తాలా మాట్లాడుతూ.. ‘‘టీ-చిప్‌ సెమీకాన్‌ రాజ్యాంగ సదస్సు ఒక సాధారణ ఈవెంట్‌ కాదు, ఇది ఒక ఉద్యమం. ప్రభుత్వ, విద్య, పరిశ్రమ రంగాల నేతలు అంతర్జాతీయ ప్రతినిధులతో కలిసి హైదరాబా ద్‌లో గ్లోబల్‌ సెమీకండక్టర్‌ రంగానికి ఒక మార్గదర్శక రాజ్యాం గాన్ని రూపొం దించనున్నారు. తెలంగాణలో ఇది ప్రారంభ బిందువుగా ఉంటే, లక్ష్యం మాత్రం భారత్‌తో పాటు ప్రపంచాన్ని సేవ చేయడమే’’ అని పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి 1.5 మిలియన్‌ సెమీకండక్టర్‌ నిపుణుల కొరత ఏర్పడనుం దని అంచనా. ఒక్క భారతదేశానికి కనీసం 85,000 మంది నిపుణులు అవసరమవు తారు. ఈ నేప థ్యంలో హైదరాబాద్‌లో జరగనున్న ఈ సమ్మిట్‌ గ్లోబల్‌ సెమీ కండక్టర్‌ విప్లవంలో భారత్‌ ను ముఖ్యంగా తెలంగా ణను ముందం జలో నిలిపే అవకాశం కలిగించనుంది. మరిన్ని వివరాలు, నమోదు, పాల్గొనదలచిన వారు tinyurl.com/t-semicon వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా +91 80199 77575 నంబర్‌కు సంప్రదించవచ్చన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News