ప్రజావాణి ఆర్జీలకు సత్వర పరిష్కారం చూపాలి : కమీషనర్ ఆర్.వి.కర్ణన్
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు, విన్నపాలను సత్వరమే పరిష్కరించాలని జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి. కర్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు కమీషనర్ కు తమ విన్నపాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రజల నుండి అందిన ఫిర్యాదులను కమీషనర్ క్షుణ్ణంగా పరిశీలించి సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమీషనర్ ఆర్.వి కర్ణన్ మాట్లాడుతూ… ప్రజల విన్నపాల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను ఆదేశించారు. అర్జీదారులు ఒకే సమస్య పై పదేపదే రాకుండా హెచ్ఓడి లు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 51 విన్నపాలు రాగా, అందులో టౌన్ ప్లానింగ్ విభాగానికి 25, హెల్త్ అండ్ శానిటేషన్ 8, ట్యాక్స్ సెక్షన్ 7, ఇంజనీరింగ్, ఫైనాన్స్ అకౌంట్ విభాగాలకు 4 చొప్పున, ల్యాండ్ అక్విజిషన్ విభాగానికి ఒక ఫిర్యాదు అందగా, ఫోన్ ఇన్ ద్వారా 2 ఫిర్యాదులు అందాయి. జిహెచ్ఎంసి పరిధిలోని ఆరు జోన్లలో మొత్తం 89 అర్జీలు వచ్చాయి. అందులో సికింద్రాబాద్ జోన్ లో 28, కూకట్ పల్లి జోన్ లో 24, శేరిలింగంపల్లి జోన్ లో15, చార్మినార్ జోన్ లో 12, ఎల్బీనగర్ జోన్ లో 10 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు వేణు గోపాల్, రఘు ప్రసాద్, గీతా రాధిక, సుభద్రాదేవి, సిసిపి శ్రీనివాస్, అడిషనల్ ఎస్.పి (విజిలెన్స్) సుదర్శన్, సి ఈ రత్నాకర్, హౌసింగ్ సి ఈ నిత్యానంద, అడిషనల్ సి సి పి లు గంగాధర్, వెంకన్న, ప్రదీప్, చీఫ్ వెటర్నరీ అబ్దుల్ వకీల్, తదితరులు పాల్గొన్నారు.