Thursday, February 12, 2026
Homeకరీంనగర్Senior Citizens | తీర్థయాత్రకు వెళ్లనున్న సీనియర్ సిటిజన్లు

Senior Citizens | తీర్థయాత్రకు వెళ్లనున్న సీనియర్ సిటిజన్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District)లోని పలువురు సీనియర్ సిటిజన్లు తీర్థయాత్ర(Pilgrimage Visit)కు వెళ్లనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లుచేయాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్(In-charge Collector Garima Agrawal) అధికారులను ఆదేశించారు. మండేపల్లిలోని ప్రభుత్వ వృద్ధాశ్రమాన్ని(Government Old Age Home) సందర్శించి అక్కడివారితో మాట్లాడి పండ్లు పంపిణీ చేశారు. వేములవాడ(Vemulawada)లోని త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలను(Tyagaraja Swamy Aradhana Utsavams) సీనియర్ సిటిజన్లు సందర్శించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ప్రతిఒక్కరి సంక్షేమానికి నిబద్ధతతో పనిచేస్తుందని పరోక్షంగా పునరుద్ఘాటించారు. అనంతరం.. తంగళ్లపల్లి మండలం మండేపల్లిలోని చిల్డ్రన్ హోమ్ నిర్మాణ పనులను కూడా ఆమె సమీక్షించారు. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి, పనులను వేగవంతం చేయాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News