మల్కాజిగిరి, నవంబర్ 17(ఆదాబ్ హైదరాబాద్): కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని మల్కాజ్గిరి(Malkajgiri) నియోజకవర్గంలోని గౌతమ్ నగర్ డివిజన్ పరిధి ఇందిరా నెహ్రూ నగర్లో శ్రీప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం(Sri Prasannanjaneya Swamy Temple) ఎదురుగా ప్రతిష్టించిన ధ్వజస్తంభానికి దీపారాధోత్సవ (Diparadhotsava) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దీపం దాత డి.ఎస్.పి (Dsp) చింతలపల్లి వంశీ మోహన్ రెడ్డి, ధ్వజస్తంభం దాత పాలపర్తి మారుతి సాయితోపాటు నిర్వాహకులు కనమల్ల నాగరాజ్, శ్రీను యాదవ్ సనాధి, బాలరాజు యాదవ్, స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
