Tuesday, March 17, 2026
Homeరంగారెడ్డిశ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో మొక్కులు చెల్లించిన భక్తులు

శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో మొక్కులు చెల్లించిన భక్తులు

అద్రస్‌పల్లి గ్రామంలోని శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో జింక పద్మజ నాగులు సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు దేవాలయానికి తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిటకిటలాడింది.

జింక పద్మజ నాగులు ముదిరాజ్ కుటుంబ సభ్యులు అమ్మవారికి ప్రత్యేకంగా మొక్కులు చెల్లించగా, భక్తులు తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమానికి మాత తపస్వి బృందం, సొప్పరి శంకర్ ముదిరాజ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, చామకూర మహేందర్ రెడ్డి, పిట్ల నాగేష్ ముదిరాజ్, జవహర్ నగర్ మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్, కొండల్ ముదిరాజ్, బండి నవీన్ గౌడ్, పల్లపు రవి తదితరులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

- Advertisement -

అనంతరం ఆలయ అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ వేడుకలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధల మధ్య కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News