విలువలతో కూడిన అభివృద్ధి బలమైన సమాజానికి పునాది అని డిప్యూటీ సీఎం(Deputy CM) మల్లు భట్టివిక్రమార్క(Mallu Bhattivikramarka) అన్నారు. చిన్మయ మిషన్ (Chinmaya Mission) ఆదివారం నిర్వహించిన అమృత్ మహోత్సవం(Amrit Mahotsav)లో ఆయన ఈ మేరకు ప్రసంగించారు. ఆధ్యాత్మికత అంటే జీవితం నుంచి వైదొలగడం కాదని, సమాజంలో బాధ్యతాయుతంగా పాల్గొనడానికి సిద్ధపడటమని చెప్పారు. విలువల్లేని అభివృద్ధి అసంపూర్ణమని తెలిపారు. వృద్ధి అనేది కరుణ, సమ్మిళితత్వం, నైతిక నాయకత్వం ద్వారా మార్గనిర్దేశం చేయాలని పేర్కొన్నారు. నిస్వార్థ చర్య, విధి నిర్వహణ, జ్ఞానం ప్రజాజీవితానికి సూత్రాలు అని చెప్పారు. ఈ మేరకు భగవద్గీతను ప్రస్తావించారు. సామాజిక న్యాయం, గౌరవం, అందరికీ అవకాశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని వివరించారు. గరిష్ట ప్రజలకు గరిష్ట ఆనందం అనే స్ఫూర్తిని పాటిస్తున్నామని తెలిపారు. యువత, విద్యా కార్యక్రమాల ద్వారా సమతుల్య, విలువలతో నడిచే పౌరులను పెంపొందించడంలో చిన్మయ మిషన్ పాత్రను ఆయన ప్రశంసించారు. ఆధ్యాత్మిక సంస్థలు సుపరిపాలనలో నిశ్శబ్ద భాగస్వాములు అని అభివర్ణించారు. నిజమైన పురోగతిని ఆర్థికపరంగానే కాకుండా గౌరవం, సామాజిక సామరస్యం అనే కోణంలో కూడా కొలవాలని భట్టివిక్రమార్క సూచించారు.
Bhatti | విలువలతో కూడిన అభివృద్ధి బలమైన సమాజానికి పునాది
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article
