శేర్లింగంపల్లి మండల పరిధిలోని మియాపూర్ సర్వే నెంబర్ 100లో ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు శనివారం కూల్చివేస్తున్నారు . ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని బలమైన కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టినట్టు ఫిర్యాదులు రావడంతో అధికారులు తక్షణమే సిబ్బందితో కలిసి చర్యలు చేపట్టారు. జేసీబీల సాయంతో కట్టడాలను నేలమట్టం చేశారు. ప్రభుత్వ భూములను ఎవరూ ఆక్రమించరాదని, ఇలాంటి చర్యలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.

- Advertisement -
