ఇటీవల జరిగిన ఉమెన్స్ వరల్డ్ కప్(Womens World Cup)–2025లో తనదైన ప్రతిభ(Talent)ను ప్రదర్శించిన టీమ్ ఇండియా క్రికెటర్ (TeamIndia Cricketer) అరుంధతి రెడ్డి (Arundathi Reddy) శుక్రవారం డిప్యూటీ సీఎం (Deputy CM) మల్లు భట్టివిక్రమార్క(Mallu BhattiVikramarka)ను మర్యాదపూర్వకంగా కలిశారు.

తెలుగు రాష్ట్రాల నుంచి మహిళా క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయి(International Level)లో రాణించడం మనందరికీ గర్వకారణమని ఈ సందర్భంగా భట్టి పేర్కొన్నారు. వారి విజయాలు మరింత మంది యువతకు ప్రేరణగా నిలుస్తాయని తెలిపారు. అరుంధతి రెడ్డిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్కుమార్ (Adluri Laxman Kumar), వాకిటి శ్రీహరి కూడా పాల్గొన్నారు.

- Advertisement -
