Monday, October 27, 2025
ePaper
Homeఆరోగ్యంCARE HOSPITALS | బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ ‘పింక్ విక్టరీ రన్ 2025’

CARE HOSPITALS | బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ ‘పింక్ విక్టరీ రన్ 2025’

రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు, ముందస్తు గుర్తింపు ప్రాముఖ్యతను తెలియజేయడానికి కేర్ హాస్పిటల్స్, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్‌తో కలిసి నెక్లెస్ రోడ్‌లోని జలవిహార్‌లో ‘పింక్ విక్టరీ రన్ 2025’ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య నిపుణులు, ఫిట్‌నెస్ ప్రియులు, రొమ్ము క్యాన్సర్ నుండి కోలుకున్న మహిళలు, అలాగే ఈ సందేశాన్ని మద్దతు ఇవ్వడానికి వచ్చిన వందలాది మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని కేర్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ మరియు అసోసియేట్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ గీతా నాగశ్రీ, జూబ్లీ హిల్స్ రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రోటేరియన్ రామ్ ప్రసాద్ కలిసి ప్రారంభించారు. డాక్టర్ గీతా నాగశ్రీ మాట్లాడుతూ..“రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే చికిత్స చాలా సులభం అవుతుంది. మహిళలు అవగాహన పెంచుకోవడం, క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవడం వలన అధునాతన దశలో క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. పింక్ విక్టరీ రన్ వంటి కార్యక్రమాల ద్వారా మహిళల్లో అవగాహన పెంచి, వారి ఆరోగ్యంపై దృష్టి పెట్టేలా ప్రోత్సహించడమే మా ఉద్దేశ్యం” అని తెలిపారు. పింక్ విక్టరీ రన్ 2025 కార్యక్రమం ద్వారా కేర్ హాస్పిటల్స్, రోటరీ క్లబ్, సేవా ఫౌండేషన్ కలిసి మహిళల ఆరోగ్యం, క్యాన్సర్ అవగాహన, నివారణ ఆరోగ్య సంరక్షణపై తమ ఉమ్మడి నిబద్ధతను చూపించాయి.

RELATED ARTICLES
- Advertisment -

Latest News