దిలావర్పూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న రైస్ మిల్ విషయంలో బీజేపీ నాయకులు, ఎమ్మెల్యేపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. రైస్ మిల్ కు బీజేపీ నేతలకు ఎలాంటి సంబంధం లేదని, కొందరు కావాలని ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని వారు మండిపడ్డారు. గ్రామపంచాయతీ నుండి నిర్మాణ అనుమతులు నిలిపివేయాలని ఎంపీఓ, ఈఓలకు వినతి పత్రం అందజేస్తామని తెలిపారు.
- Advertisement -
