మాజీ మంత్రి, నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి(Vemula Prashanth Reddy) దంపతులు ఇవాళ గురువారం నూతన సంవత్సరం(New Year), వివాహ వార్షికోత్సవం(Wedding anniversary) సందర్బంగా దైవదర్శనం చేసుకున్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్న హనుమాన్(Hanuman), శివాలయం(Lord Shiva Temple) దేవాలయాన్ని సందర్శించారు. స్వామి వారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వేద పండితుల ఆశీర్వాదం తీసుకొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు(BRS Party Cadre), బంధుమిత్రులకు, స్నేహితులకు, కుటుంబ శ్రేయోభిలాషులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు(New Year Wishes) చెప్పారు.
- Advertisement -
