దేవరకొండ, నవంబర్ 12 (ఆదాబ్ హైదరాబాద్): నల్గొండ జిల్లా చందంపేట మండలం గువ్వలగుట్ట వద్ద అటవీ సిబ్బంది(Forest Staff)పై గ్రామస్తులు (Villagers) దాడి చేశారు. అటవీ భూములను అక్రమంగా (Illegal) దున్నుతుండటంపై సమాచారం (Information) అందుకున్న సిబ్బంది.. మధ్యాహ్నం అక్కడికి చేరుకొని అడ్డుకున్నారు. పట్టాలు (Patta Books) చూపించి దున్నుకోవాలనగా గ్రామస్తులు ఆగ్రహం చెంది రాళ్లు(Stones), కర్రల(Sticks)తో దాడి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు సిబ్బందికి గాయాలయ్యాయి. బాధితులను దేవరకొండ (Devarakonda) ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
- Advertisement -
