- ఆదాబ్ హైదరాబాద్ వార్తకు స్పందించిన అధికారులు..
మచ్చబొల్లారం లక్ష్మీ నగర్ లక్ష్మి ఎన్ క్లేవ్లో ప్రమాద కరంగా మారిన మ్యాన్ హోల్ పై అధికారులు మూత ఏర్పాటు చేశారు. ఈ సమస్యను ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రిక వెలుగులోకి తెచ్చింది. దీనికిస్పందించిన అధికారులు శుక్రవారం ప్రమాదకరంగా మారిన మ్యాన్ హోల్ ను పరిశీలించి వెంటనే మూత ఏర్పాటు చేశారు. ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఈసమస్య పరిష్కారం చేసిన విజన్ ఆంధ్ర దినపత్రికకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -
