Friday, March 13, 2026
Homeఆదిలాబాద్Nirmal | స్మశాన వాటికలో సమస్యలు పరిష్కరిస్తాం..

Nirmal | స్మశాన వాటికలో సమస్యలు పరిష్కరిస్తాం..

  • నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి..

నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంచిర్యాల చౌరస్తాలో గల స్మశానవాటికలో పూర్తి స్థాయి సౌకర్యాలు కలిపిస్తామని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. మున్సిపల్ అధికారులు, స్మశానవాటిక కమిటీ సభ్యులు, స్థానిక కౌన్సిలర్లతో కలిసి స్మశానవాటికను సందర్శించారు.

అవసరమణ సౌకర్యాలపై ఆరా తీసారు. అనంతరం మాట్లాడుతూ పట్టణంలోని మంచిర్యాల చౌరస్తాలో గల స్మశానా వాటిక అసంపూర్తిగా ఉందని , అంత్యక్రియల సమయంలో ఇబ్బంది ఎదురవుతున్నాయని పిర్యాదులు రావడం సందర్షించామన్నారు. నాలుగు రోజుల్లో నీటి సౌకర్యం, సానిట్రేషన్ మెరుగుపడే విదంగా చర్యలు తీసుకుంటామని , అసంపూర్తిగా ఉన్న పనులను మూడు నెలల్లో వేగవంతగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ పనులపై అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తేలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News