Friday, February 13, 2026
HomeతెలంగాణGram Panchayats | గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్

Gram Panchayats | గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్

  • రూ.387 కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం..
  • ఫలించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క వినతి..
  • ఇప్పటికీ పెండింగ్లో 2,400 కోట్ల నిధులు..
  • విడతల వారీగా విడుదల చేస్తున్న కేంద్రం

గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం కింద రూ.387 కోట్లని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొదటి విడతగా ఇప్పటికే రూ. 259.36 కోట్లు విడుదలైన విషయం తెలిసిందే. తాజా విడతతో కలిపి మొత్తం నిధులు రూ. 646.36 కోట్లు విడుదలయ్యాయి. తెలంగాణకు 15వ ఆర్థిక సంఘం కింద సుమారు రూ.3,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. గ్రామపంచాయతీ ఎన్నికలు పూర్తి చేసి, కేంద్రం కోరిన సమాచారాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ సమర్పించింది.

ఇందుకు అనుగుణంగా విడతలవారీగా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇంకా సుమారు రూ. 2,400 కోట్లు విడుదల కావాల్సి ఉంది. గ్రామాల అభివృద్ధి కోసం పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్రానికి తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. దీనితో తాజాగా నిధులు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం..

- Advertisement -
RELATED ARTICLES

Latest News