ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన 4వ టీ20 మ్యాచ్లోనూ టీమిండియా(TeamIndia)నే విజయం సాధించింది. తద్వారా 5 మ్యాచ్ల సిరీస్(Series)లో 2-1 తేడాతో ఆధిక్యం ప్రదర్శించింది. ఆస్ట్రేలియా 119 రన్నులకు ఆలౌట్ (Allout) అయింది. ఇండియా 48 పరుగుల తేడాతో నెగ్గింది. క్వీన్స్ల్యాండ్ (Queensland) వేదికగా ఇవాళ జరిగిన మ్యాచ్లో ఇండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. గిల్ (Gill) 46 రన్నులు చేశాడు. 168 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఏ దశలోనూ పోరాటం చేయలేదు. వరుసగా వికెట్లు కోల్పోయి పరాజయాన్ని మూటగట్టుకుంది.
- Advertisement -
