Friday, October 18, 2024
spot_img

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు నామినేషన్‌ దాఖలు

తప్పక చదవండి

పాలకుర్తి : బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు నామినేషన్‌ దాఖలు చేశారు. పాలకుర్తిలోని తహశీల్దార్‌ కార్యాలయంలో మొదటి సెట్‌ నామినేషన్‌ సమర్పించారు. అంతకుముందు సోమేశ్వర శ్రీ లక్ష్మినరసింహ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆయన.. పట్టణంలో భారీ ర్యాలీ తీశారు. కార్యర్తలు, అభిమానులతో కలిసి తహశీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు 1994 నుంచి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. 1994లో తొలిసారి వర్ధన్నపేట నుంచి గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1999, 2004లో కూడా అదే నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. అయితే 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో వర్ధన్నపేట ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానంగా మారింది. అప్పటివరకు ఉన్న చెన్నూరు నియోజకవర్గం పాలకుర్తిగా అవతరించింది. 2009 సాధారణ ఎన్నికల్లో దయాకర్‌ రావు పాలకుర్తి నుంచి పోటీ చేసి నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014, 2018లో కూడా పాలకుర్తి నుంచి విజయం సాధించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు