నాగారం సెరినీటీ పాఠశాలలో 77వ గణతంత్ర వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. నాగారం రాంపల్లి పాఠశాలల వ్యవస్థాపకురాలు నోముల వసంత, కరెస్పాండెంట్ నోముల జంగి రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
- Advertisement -
